జోగులాంబ గద్వాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) గురువారం గద్వాల జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ( BRS Leaders ) ను ముందస్తుగా హౌస్ అరెస్టు( Arrest ) చేశారు
గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడును పోలీసులు అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, కురువపల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ను అరెస్టు చేయడం పట్ల హనుమంతు నాయుడు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీస్ల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై అంక్షలు ఎందుకని నిలదీశారు. మూడు సంవత్సరాల పాలనకే ఇంత అభద్రతాభావమా.. ఇంతటి అరాచకమా? అని మండిపడ్డారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రతిపక్ష పార్టీల సూచనలను, ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ప్రాజెక్టుల సందర్శన చేపట్టడం విచారకరమని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు.