సిరిసిల్ల టౌన్, మార్చి 23: సిరిసిల్ల అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫొటోతో ఉన్న ఓ టీ స్టాల్ను ఏడాది క్రితం తొలగించింది. మున్సిపల్ వాహనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ హోటల్ సామగ్రిని తీసుకెళ్లింది. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాసటగా నిలిచారు. సొంత డబ్బులతో సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌరస్తాలో నిరుడు మార్చి 23న కేటీఆర్ టీ స్టాల్ను ప్రారంభించి శ్రీనివాస్కు మనోధైర్యాన్ని అందించారు.
టీ స్టాల్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో టీ స్టాల్ వద్ద కేక్ కట్ చేసి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మ న్ సందీప్, విప్ మల్లికార్జున్గౌడ్, శంకరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.