రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth) చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) భగ్గుమన్నది. 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించి పదేండ్ల పాలనలో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్పై నోరుపారేసుకుంటే సహించబోమని హెచ్చరిస్తూ నిరసనలకు దిగింది.
సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి గంభీరావుపేటలో న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నేతృత్వంలో కార్యకర్తలు ధర్నా చేశారు. ‘రేవంత్రెడ్డి ఖబడ్దార్..ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం..వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్డుపై దిష్టిబొమ్మలు(Effigies) దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సీఎం సీట్లో కూర్చున్నానే సోయిలేకుండా రేవంత్రెడ్డి ప్రతిపక్ష నేతలా దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పాలన చేతగాక, గ్యారెంటీలను అమలు చేసే దమ్ములేక కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నాడని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా మాటలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. లాక్కుంటూ వెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు మ్యాన రవి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.