ఇల్లంతకుంట, జూన్ 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కట్టపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, పార్టీ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని బీడు భూములను కాళేశ్వరం నీటితో పచ్చని పంట పొలాలుగా మార్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతులను రాజులను చేయడానికి కేసీఆర్ చేసిన కష్టాన్ని ఎవరూ మరిచిపోరని పేర్కొన్నారు. కేసీఆర్పై కక్షగట్టి, ఆయన ప్రతిష్ఠను దిగజార్చాలనే రేవంత్రెడ్డి నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. మండుటెండల్లోనూ గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు, కుంటలు మత్తడులు దుంకించినందుకు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు.