సిరిసిల్ల టౌన్/హుజూరాబాద్ టౌన్, జనవరి 9: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని చెప్పారు. హుజూరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు.
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ సర్కారు ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీణవంకలో మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపెల్లి మహేశ్, నియోజకవర్గ యువ నేత నాగిరెడ్డి మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు అన్నారం శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్ల సందీప్, సబ్బని హరీశ్, కంచర్ల రవిగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.