మాచారెడ్డి, సెప్టెంబర్ 25: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 16 గ్రామాల ప్రజలు కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మద్దతు ప్రకటించారు.
తాజాగా ఘన్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్, యాదవ, గౌడ, విశ్వబ్రహ్మణ, వెలమ సంఘాలతోపాటు గంగాపుత్ర, రజక, మాల సాడెం సంఘం, మాల సల్ల సంఘం, మాదిగ మద్దికుంట సంఘం, మాదిగ సిరికొండ సంఘం సభ్యులు సీఎం కేసీఆర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు తీర్మాన కాపీలను అందజేశారు.