RS Praveen Kumar | కేసీఆర్ ప్రభుత్వం అప్పులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పదేళ్లలో రూ.6.71లక్షల కోట్లు అప్పులు చేశారని అంటున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లో రూ.16,400కోట్లు అప్పులు చేసిందని వార్తలొస్తున్నాయన్న ఆయన.. ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరుమీద చేసే అప్పులు దీనికి రెండింతలుంటాయన్నారు.
వాటిని బడ్జెట్లో చూపించరన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అప్పుల్లో మౌలిక సదుపాయాలైనా వచ్చాయని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటి ఊసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తుందని విమర్శించారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను దాచకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.