హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వికృత పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫిరాయింపుల విషయంలో మీరు చెప్పిన నీతిసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బుల్డోజర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మీరు తెలంగాణలో మీ పార్టీ ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ అరాచకానికి దిగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అంటూ హరీశ్రావు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాహుల్కు బహిరంగలేఖ రాశారు. రేవంత్ అరాచక పాలనపై ప్రజల నుంచి నిరసనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
లేఖలోని అంశాలు..