Harish Rao | హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో ప్రజల ప్రాణాలు కాపాడిన పోలీసుల జీవితాలకే ‘భద్రత’ లేకుండా పోవడం సిగ్గు చేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగి (ASI) సాధిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇక అతహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారిందని హరీశ్రావు విమర్శించారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయమని విమర్శించారు.
హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో ప్రజల ప్రాణాలు కాపాడిన పోలీసుల జీవితాలకే ‘భద్రత’ లేకుండా పోవడం సిగ్గు చేటు.
రిటైర్డ్ పోలీసు ఉద్యోగి (ASI) సాధిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇక అతహత్యే శరణ్యం అంటూ ఆవేదన… pic.twitter.com/lW94vjsNEH
— Harish Rao Thanneeru (@BRSHarish) January 8, 2025
మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆరోగ్య భద్రత పథకాలను సేవలను సైతం అటకెక్కించే పరిస్థితి కల్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్రావు మండిపడ్డారు. అత్యవసర వైద్య సేవలు అందకుండా చేశారని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించి, ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్య సేవలు కొనసాగేలా చూడాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బెన్ఫిట్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవంతంగా ఉద్యోగాలు పూర్తిచేసి, జీవితంలో విజయం సాధించిన మీ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని సూచించారు. పోరాడి పరిష్కారం చేసుకుందాం.. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.