హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీసీలను నిండా ముంచి, బీసీ టికెట్లను అంగట్లో సరుకుల్లా అమ్మకున్నోళ్లే తిరిగి బీసీ డిక్లరేషన్ను ప్రకటించ డం దయ్యాలు వేదాలు వల్లించడమేనని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఘా టుగా విమర్శించారు. రేటెంతరెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ పేరుతో బీసీలను వంచించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ‘బీసీలను రాజకీయంగా బొంద పెట్టినోడు, బీసీలను బాగు చేస్తాడా?’ అంటూ రేవంత్రెడ్డిని ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం దాసోజు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్కు బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదని, ఇది కేవలం బలిచ్చే గొర్రెకు చేసే అలంకరణలాంటిదేనని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్ అంటూ విడుదల చేసిన బ్రోచర్లో కనీసం ఒక బీసీ నాయకుడి ఫొటో కూడా లేదని, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాషీ, బీసీల కోసం పోరాటం చేస్తున్న వీహెచ్, బీసీ డిక్లరేషన్ చైర్మన్ పొన్నం ప్రభాకర్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్, మహేశ్గౌడ్ల ఫొటోలు లేవని.. ఇదేనా కాంగ్రెస్కు బీసీలపై ఉన్న గౌరవం, చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. బీసీలకు 34 సీట్లిస్తామని పీఏసీలో తీర్మానం చేసి, అంతకంటే ఒక సీటు ఎకువనే ఉంటుందని ప్రకటించి, తీరా 22 సీట్లకు పరిమితం చేసి బీసీ సీట్లను అడ్డగోలుగా అమ్ముకున్నోళ్లేనా బీసీలకు న్యాయంచేసేది అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీసీల్లారా.. తస్మాత్ జాగ్రత్త, మోసపోతే గోసపడుతాం, ఈ దొంగలని నమ్మితే నిలువు దోపిడీకి గురవుతాం’ అని దాసోజు శ్రావణ్ హెచ్చరించారు.