హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పరిశ్రమలను దొడ్డిదారిన కర్ణాటకకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లోని పరిశ్రమలను దొడ్డిదారిన బెంగళూరుకు తరలించడానికి ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్, కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని అన్నారు. ఈ దుర్మార్గంపై తెలంగాణ సమాజానికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంట్ సరఫరా, సింగిల్ విండో పాలసీ టీఎస్ఐపాస్, అద్భుతమైన రాయితీలు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ మినిస్టర్ కేటీఆర్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కేసీఆర్ గవర్నెన్స్, అద్భుతమైన లా అండ్ ఆర్డర్వంటి వాటితో హైదరాబాద్కు పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
డీకే శివకుమార్కు దమ్ముంటే బెంగళూరును కూడా హైదారాబాద్కు దీటుగా అభివృద్ధి చేసుకోవాలని, అంతేతప్ప ఎన్నికల పేరుతో వచ్చి దొంగచాటున పరిశ్రమలు తరలించే కుట్రలు చేయడమేంటని మండిపడ్డారు. ఫాక్స్కాన్ కంపెనీని తెలంగాణకు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ ఐదేండ్లు కృషి చేశారని గుర్తు చేశారు. తద్వారా రూ.3,500 కోట్ల పెట్టుబడి, సుమారు 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఆ 10 లక్షల మంది పొట్టకొట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్లో శంకుస్థాపన అయిపోయి.. పనులు జరుగుతున్న కంపెనీని బెంగళూరు తరిలించే కుట్ర జరుగుతుంటే.. రేవంత్ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. డీకే శివకుమార్ నేతృత్వంలో రేవంత్ కర్ణాటక కోసం పనిచేస్తున్నారని, తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్, డీకే శివకుమార్లాంటి మోసగాళ్ల పట్ల తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రూ.2.5 లక్షలకోట్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ను బీజేపీ తన్నుకుపోయిందని.. ఇవాళ ఫాక్స్కాన్ను కాంగ్రెస్ తన్నుకుపోవాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు కర్రుకాల్చి వాత పెట్టాలా? వద్దా? అనేది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ కలిసి నేడు ఇండస్ట్రీ పోచింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విజ్ఞత, వెన్నెముక లేని నాయకులని మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ బానిసత్వపు నాయకులవల్ల తెలంగాణకు న్యా యం జరగదని, తెలంగాణ సమా జం, యువత ఆ విషయాన్ని గుర్తించాలని కో రారు. ఆయన వెంట రాష్ట్ర టూరిజం కా ర్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కో లేటి దామోదర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.