డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాటమార్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తాననడం సరికాదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే రేవంత్ రెడ్డి కొత్త రాగం అందుకున్నాడని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా రుణమాఫీకి ఏం అడ్డువచ్చిందని నిలదీశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో పర్యటించిన వినోద్కుమార్.. వరి కోతలు మొదలైనా అనేక చోట్ల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని విమర్శించారు. ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కూడా తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సెంటర్ల నుంచి ధాన్యం తరలించేందుకు మిల్లులకు ఎందుకు అలాట్మెంట్ చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు.