డిచ్పల్లి/మనోహరాబాద్/తుర్కపల్లి, మే 17: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. సన్న, దొడ్డు, తడిసిన వడ్లు అనే తేడా లేకుం డా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆగస్టు 15వ తేదీ లోపల రుణమాఫీ చేయాలని, లేకుంటే.. సర్కారు మెడలు వంచైనా అన్నదాతలకు బోనస్ ఇప్పిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బోనస్ వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ముచ్చటించారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలి సి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులు అరిగోస పడుతున్నారరని వంటేరు మండిపడ్డారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనకపోవడంతో వర్షానికి తడిసి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.