ఖమ్మం, జనవరి 19: ఖ మ్మం సభకు చరిత్రలో సుస్థిర స్థానం లభించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బుధవారం నాటి బహిరంగ సభ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని అన్నారు. గురువారం ఆయన ఖమ్మం లో మీడియాతో మాట్లాడా రు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా 50 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సభ జరగలేదని, ఈ సభ ఇక చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. సభకు 5 లక్షలకుపైగా జనం హాజరయ్యారని, సభా ప్రాంగణం మహాకుంభ మేళాను తలపించిందని చెప్పారు. సభను సక్సెస్ చేసిన వారందరికీ జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి, ఎమ్మెల్యేలను, నేతలను సమన్వయం చేసుకొని, సభ ఇన్చార్జిగా వ్యవహరించి అన్ని తానై నడిపించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎ మ్మెల్యేలు, జిల్లా నేతలకు ప్ర త్యేక కృతజ్ఞతలు తెలిపారు.