హైదరాబాద్: ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్ నినాదాలతో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా మారుమోగుతున్నాయి. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రతినిధుల సభకు చేరుకుంటున్నారు. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్పర్సన్ వసంత తదితరులు పాల్గొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రేగ కాంతారావు పార్టీ జెండా ఎగురవేశారు.
నల్లగొండ జిల్లాలో..
జగిత్యాల జిల్లా..
పెద్దపెల్లి..
ఆదిలాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
సిద్దిపేటలో..
హైదరాబాద్లో..
భూపాలపల్లి జిల్లాలో..