యాదాద్రి భువనగిరి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) మరోసారి అధికారంలోకి రావాలని, కేసీఆర్(KCR) మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ అభిమాని ఒకరు పొర్లుదండాలతో యాదగిరి గుట్ట(Yadagiri gutta)కు చేరుకున్నారు. సంగారెడ్డి (Sangareddy )జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు గ్రామం నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరి గుట్టకు పాదయాత్రగా బయలు దేరారు.
బీఆర్ఎస్ శ్రేణుల బృందంలో నాగయ్య స్వామి అనే వ్యక్తి యాదగిరిగుట్టకు 21 కిలోమీటర్లు ముందు నుంచి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పొర్లుదండలు చేశాడు. అనంతరం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.