గార్ల/కురవి, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్ని వర్గాల ప్రజల ఆశీర్వా దం బీఆర్ఎస్కే ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో రాంపురం పాకాల యేటిపై రూ.15 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణంతో ఇక్కడి ప్రజ ల చిరకాల కల నెరవేరనున్నదని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మూడోసారి వందకుపైగా సీట్లు గెలి చి.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమ ని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తన సొం తూరు మహబూబాబాద్ జిల్లా కురవి మం డలం పెద్దతండాలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులను ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ శశాంక్లతో కలిసి ప్రారంభించారు. బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్. పెద్దతండాలో పుట్టిన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను. పెద్దతండా అభివృద్ధి చెందే సమయానికి నా తల్లిదండ్రులిద్దరూ లేరు. సీఎం కేసీఆర్ దయతో నా నాన్న కోరికను నెరవేర్చా’ను అని గుర్తుచేసుకుంటూ సభావేదికపైనే బోరున విలపించారు.