కొత్తపల్లి, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం చంద్రబాబు, వైఎస్సార్ వల్లనే కాలేదని, వారి శిష్యులైన రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఏమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకులతో శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో బంజారాలు ముందున్నారని, వారి అభివృద్ధి కోసం కేసీఆర్ 10% రిజర్వేషన్లు కల్పిస్తే, కేంద్రం కుట్రపూరితంగా అడ్డకున్నదని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో నాయకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన 1,60,083 మంది ఉద్యోగులకు రేవంత్రెడ్డి గత రెండు నెలలుగా వేతనాలు వేస్తున్నారో లేదో చెప్పాలని సవాల్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎగిరేది బీఆర్ఎస్ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు.