హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగా ణ): కేసీఆర్ మరోమారు సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధులతో శుక్రవారం తెలంగాణ భవన్లో మీడి యా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వివిధ దేశాలకు చెందిన 100 మంది ఎన్నారైలు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఎజెండా లేని ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్పై నోరు పారేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి పల్లె నుంచి పట్టణం వరకు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నారైలంతా ప్రచారంలో పాల్గొని కేసీఆర్కి మళ్లీ పట్టం కడతామని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి , అశోక్ దూసరి, చందుతల్లా, పూర్ణ బైరి, విన్నీగౌడ్, విష్ణు జైగుండాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మల్దీవులకు చెందిన ఎన్నారై ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.