హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణభవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, నమస్కరించారు. అక్కడి నుంచి భవన్ ప్రాంగణంలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహం వద్దకు చేరుకొని, పూలమాలవేసి, నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, పార్లమెంటరీ పార్టీనేత కేకే తదితరులు పాల్గొన్నారు.