సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి(Mla Bhupal Reddy) అన్నారు. శనివారం మనూరు మండల పరిధిలోని డొవూర్, డొవూర్ తండాలల్లో రూ.30లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీరోడ్డు(CC Roads) పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అభివృద్ధి పనులకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో కంటే బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్డు, మురికి కాలువల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందుతున్నాయని అన్నారు.
అనంతరం డొవూర్ లొంక తండాలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొంగరి జయశ్రీ మొహన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు విఠల్రావు పాటిల్, మండల రైతు సమన్వయ సమితీ అధ్యక్షులు జనార్దన్రెడ్డి, నాయకులు నాగేందర్రావు పాటిల్,గ్రామస్తులు పాల్గొన్నారు.