హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని, అన్యోన్య దాంపత్యానికి పుణ్యదంపతులైన సీతారాములు ఆదర్శనీయులని తెలిపారు. ఆ సీతారాముల కరుణకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామచంద్రులను కేసీఆర్ ప్రార్థించారు.