KCR | సిద్దిపేట : వరంగల్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా హాజరయ్యారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత బీఆర్ఎస్కు రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పిలుపు మేరకు రాజయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.