KCR | గజ్వేల్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చింతమడక గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం కలిశారు. కేసీఆర్ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులకు అభివాదం చేశారు. కేసీఆర్ను చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణను సాధించిన జాతిపిత, దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ గారిని చూసేందుకు అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
తమ అభిమాన నేతను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
బుధవారం… pic.twitter.com/8jY4eBEY2D
— BRS Party (@BRSparty) December 6, 2023