తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్, సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్, కుత్బుల్లాపూర్లో వివేకానంద, బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, కంటోన్మెట్లో లాస్య నందిత, నర్సాపూర్లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు.
ఇక సూర్యాపేట, శేరిలింగపల్లి, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, గజ్వేల్, జహీరాబాద్, జనగామ, స్టేషన్ ఘన్పూర్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, అలంపూర్, దేవరకద్ర, గద్వాల, నాగర్కర్నూల్, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.