ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై అనిల్ జాదవ్ 23,023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనిల్ జాదవ్కు 76,297 ఓట్లు రాగా, సోయం బాపూరావుకు కేవలం 53,274 ఓట్లు మాత్రమే వచ్చాయి.