బాన్సువాడ రూరల్/వర్ని, నవంబర్ 26: భూకబ్జాదారుడు, బ్రోకర్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని, నియోజకవర్గం ప్రజలతో నిత్యం వెన్నంటి ఉం టూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా వర్ని మండలాల్లో ఎన్నికల ప్రచారసభల్లో మా ట్లాడారు.
అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకొని తిరగబడితే పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించిన కబ్జాదారుడు ఏనుగు రవీందర్రెడ్డి అని విమర్శించారు. బ్రోకర్కు హటావో.. పోచారానికి జితావో అం టూ నినదించారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులు అభిమానంతో తీసుకొచ్చిన నీరాను స్పీకర్ తాగారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.