BRS Bhavan | ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ 2004లోనే ఆలోచించారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రాంతీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే ఆ పార్టీకి కనీసం ఐదుగురు ఎంపీలు ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాలు, 15 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీకి 1,000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. బీఆర్ఎస్కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలం ఎంపికను వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నారు. వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించిన అనంతరం వసంత్విహార్లో ఎంపిక చేశారు. టీఆర్ఎస్గా పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించుకోగా బీఆర్ఎస్గా కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం విశేషం. భూమిపూజ జరిగిన 29 నెలల్లోనే కార్యాలయ నిర్మాణం పూర్తవ్వడం మరో విశేషం.