పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని(Manthani) మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో మంథనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు(Brothers died) తాటి నాగరాజు గౌడ్, నవీన్ గౌడ్ దుర్మరణం చెందారు. మంథనికి చెందిన సోదరులిద్దరు మంథని నుంచి బేగంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుంటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.