వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో ఇసుక(Sand) దందా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు(Brokers) యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ – వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాల్లో ఉన్న ఆకేరు వాగులో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.
రోజు వరంగల్ నగరానికి వందల ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని, ఇసుక రవాణాతో భూగర్భజలాలు పడిపోతున్నాయని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఇసుక రవాణాను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.