జలియన్వాలాబాగ్ ఘోరకలి దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. స్వాతంత్య్ర పోరాటాన్ని కీలక మలుపు తిప్పిన ఆ ఘటన గురించి మనదేశ ప్రజలకు తెలిసినంతగా అప్పట్లో బ్రిటిష్ ప్రజలకు తెలియదు. ఆ పని ఓ బ్రిటిష్ పాత్రికేయుడే దిగ్విజయంగా జరిపాడు.
ప్రముఖ జర్నలిస్టు బెంజమిన్ గై హార్నిమన్ను కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన ఫిరోజ్షా మెహతా తన బాంబే క్రానికల్’ పత్రికకు విలేకరిగా కోరి తెచ్చుకున్నారు. ఆ పత్రిక ద్వారా హార్నిమన్ జలియన్వాలా బాగ్ ఘాతుకాలను తనదేశ పౌరుల కళ్ల ముందుంచాడు.
పత్రికా స్వేచ్ఛకు పట్టం కడుతూ.. నరమేధం ఫొటోలు, లోగుట్టు కథనాలతో బ్రిటిష్ పౌరులకు ఇండియాలో జరుగుతున్నదేమిటో తెలిసేలా చేశాడు. ఇదంతా గిట్టని బ్రిటిష్ పాలకులు ఆయనను అరెస్టు చేసి బ్రిటన్కు పంపేశారు. అదే పత్రికకు చెందిన గోవర్దన్ దాస్ అనే విలేకరిని మూడేండ్లు జైల్లో పెట్టారు. మధ్యకాలంలో బ్రిటన్లో తన పదునైన పాత్రికేయాన్ని కొనసాగించి 1926లో ఇండియాకు తిరిగివచ్చి అదే బాంబే క్రానికల్లో చేరారు. తర్వాత ఇండియన్ నేషనల్ హెరాల్డ్తో సహా పలు ఇతర పత్రికల్లో హార్నిమన్ పనిచేశారు. పత్రికల్లో ట్రేడ్ యూనియనిజానికి ఆయనను ఆద్యుడుగా భావిస్తారు.