హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాబోయేకాలంలో వేరుశనగ పంట విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా వనపర్తి జిల్లా వీరాయపల్లిలో ఆచార్య జయశంకర్ వ్యవసా య విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సహకారంతో వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. ఇందుకోసం 40 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే రూ.2 కోట్లు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. సోమవారం ఆయన వ్యవసాయ యూనివర్సిటీలో వేరుశనగ సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వేరుశనగ సాగును మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వేరుశనగను యాసంగిలో ప్రధాన నూనె గింజల పంటగా మార్చాలని పేర్కొన్నారు.
ఈ మేరకు పాలెం, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పంట క్యాలెండర్ తయారుచేసి దానికి అనుగుణంగా రైతు వేదికల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మ డి పాలమూరు జిల్లాలో ఉత్పత్తి అయ్యే వేరుశనగకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, ఆఫ్లాటాక్సిన్ లేని నాణ్యమైన పంట ఈ ప్రాంత ప్రత్యేకత అని అన్నారు. ఆయా జిల్లా ల్లో ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధిక దిగుబడి ఇచ్చి, చీడపీడలను తట్టుకొనే నూతన వంగడాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని కోరారు. సమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, రిజిస్ట్రార్ సుధీర్, పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జనీలా, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఆగ్రోస్ ఆధ్వర్యంలో మిల్లెట్ కౌంటర్స్
చిరు ధాన్యాలను విక్రయించేందుకు మిల్లె ట్ కౌంటర్స్ను ఏర్పాటు చేయాలని ఆగ్రోస్ నిర్ణయించింది. ఈ మేరకు హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్తో ఆగ్రోస్ సోమవారం ఒప్పం దం కుదుర్చుకున్నది. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అం దించాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని సులభతరం, లాభసాటి చేసేలా దృష్టిసారించాలని సేవా కేంద్రాల నిర్వాహకులకు మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన శిక్షణలో పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో కూడా ఊబరైజేషన్ తరహా ఆలోచనలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి తాను అనేక మంది శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ నిపుణులు, అగ్రి కంపెనీలతో మాట్లాడానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, ఎండీ రాములు, సిజెంటా, హరేరామ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.