హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రికి వినతిపత్రం సమర్పించారు.
సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని శేషాద్రి హామీ ఇచ్చారు.