కృష్ణ, ఫిబ్రవరి 22 : కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్టు సమీపంలో కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతు పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ర్టాలను కలిపే 167 జాతీయ రహదారిపై రాయిచూర్కు వాహనాలు వెళ్లకుండా మళ్లించారు. 25వ తేదీ రాత్రి 10 వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాయిచూర్ వెళ్లే వాహనాలు మరికల్ మీదుగా చిత్తనూర్, అమరచింత, జూరాల డ్యామ్, గద్వాల, కేటీదొడ్డి మీదుగా వాహనాలను మళ్లించినట్టు డీఎస్పీ తెలిపారు.