హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్పై మరింత అవగాహన అవసరమని హైదరాబాద్లోని కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్, ప్రముఖ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పిల్లారిశెట్టి రఘురామ్ తెలిపారు. అవగాహనలేమివల్ల నేటికీ అనేక మందికి రొమ్ము క్యాన్సర్ ప్రాణాంతకంగా మారుతున్నదని చెప్పారు. జపాన్ సర్జికల్ కాంగ్రెస్ (జేఎస్ఎస్) 123వ వార్షికోత్సవం ఈ నెల 27న జపాన్లోని టోక్యోలో గ్రాండ్ ప్రిన్స్ హోటల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. శనివారం ముగింపు సమావేశానికి డాక్టర్ రఘురామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశాలతో సంబంధం లేకుండా వైద్యసేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడ్డా రు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సర్జికల్ ఆర్గనైజేషన్ అయిన ఏఎస్ఐకి చెందిన డాక్టర్ నందిని (పాలక్కాడ్), డాక్టర్ ప్రియాంక (ఎయిమ్స్-భువనేశ్వరి), డాక్టర్ రేష్మ బాలచంద్రన్ (టాటా మెమోరియల్ హాస్పిటల్-ముంబై)కి ట్రావెలింగ్ కోసం 6 వేల డాలర్ల సహాయం అందించాలని డాక్టర్ రఘురామ్ చేసిన విజ్ఞప్తికి జపాన్ సర్జికల్ సొసైటీ సానుకూలంగా స్పందించింది. టోక్యో యూనివర్సిటీలో పరిశీలనకు అవకాశం కల్పించింది. జపాన్లోని భారత రాయబారి సీబీ జార్జ్తోపాటు పలువురు పాల్గొన్నారు.