TS TET | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. టెట్ ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించరాదని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. మిగతా పరీక్షలు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.