హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల వైస్చాన్స్లర్ పోస్టులకు భారీగా దరఖాస్తులొచ్చాయి. సోమవారం గడువు ముగిసే సమయానికి 1,382 దరఖాస్తులొచ్చాయి. మొత్తం 312 మంది ఆచార్యులు 10 వీసీ పోస్టులకు పోటీపడుతున్నారు. వీరిలో కొందరు రెండు అంత కుపైగా వర్సిటీల వీసీ పోస్టుల రేసులో ఉన్నారు. 10 వర్సిటీల్లో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ(బీఆర్ఏవోయూ) వీసీకి అత్యధికంగా 208 దరఖాస్తులొచ్చాయి. ఆత ర్వాత ఓయూ వీసీ పోస్టుకు 193 మంది ఆచార్యులు దరఖాస్తులిచ్చారు. జేఎన్టీయూహెచ్కు 106 దరఖాస్తులే వచ్చాయి. పాలమూరు, శాతవాహన, ఎంజీ వర్సిటీల కన్నా కాకతీయ, జేఎన్టీయూహెచ్లకు తక్కు వ దరఖాస్తులొచ్చాయి. వీసీల నియామక ఉత్తర్వులు మేలో వచ్చే అవకాశం ఉన్నది.