హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం మానేయాలని సూచించారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరుగకూడదని చెప్పారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నాని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతోనే తెలంగాణలో సెల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని, కానీ ఈ హామీలను కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెడితే మాత్రం ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపివేస్తామని అమర రాజా బ్యాటరీ అండ్ మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా హెచ్చరించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
‘తెలంగాణలో రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమరరాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాం. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలి. మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని ఆశిస్తున్నా.
నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
We had worked very hard to convince Amara Raja to invest 9,500 Crore in Telangana. Government is an institution that has to ensure policy continuity
Brand Telangana should not suffer because of our political differences
I hope the Congress Govt will wisen up & honour the… pic.twitter.com/nd1nSf1OPO
— KTR (@KTRBRS) August 11, 2024