యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింమ స్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నాయి. తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. దాదాపు 2 గంటలపాటు జరిగే వేడుకను వీక్షిస్తారు.