హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 3న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరిషత్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించడంతో పాటు హైదరాబాద్ గోపనపల్లిలో ప్రభుత్వం ఆరెకరాల్లో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం గురించి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ భవనాన్ని మే 31న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని పరిషత్ కార్యవర్గం భావిస్తున్నదని తెలిపారు.