హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు. నూతన సచివాలయం లో మూడో రోజైన మంగళవారం విధులకు హాజరైన విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డిని అసోసియేషన్ నేతలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు సచివాలయ నిర్మాణ గొప్పదనాన్ని మంత్రితో పంచుకున్నారు. ఇది చరిత్రాత్మక కట్టడంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సదానందం, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్నారాయణ, సెక్రటరీ జనప్రియ, పీవీ రావు, సురేశ్, భాసర్, ఆర్థిక కార్యదర్శి రాజు, బాగయ్య, గోపాలకృష్ణ, గోపాలరావు, వెంకటేశ్, ప్రశాంత్, కిరణ్, విద్యాసాగర్, మల్లయ్య, శివశంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.