ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు(lovers) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రియుడు(Boyfriend died) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన బెజ్జంగి రాజేశ్(24) అనే యువకుడు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శిరీష (20) రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని దవాఖానకు తరలించారు. కాగా, రాజేశ్, శిరీష వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ప్రేమ జంట మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.