రఘునాథపాలెం, మార్చి 13 : వీధి కుక్కలు దాడి ఘటనలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పుఠానీతండాలో చోటుచేసుకున్నది. పుఠానీతండాకు చెందిన బానోతు భరత్(5) ఆదివారం సాయంత్రం తోటి చిన్నారులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.
ఈ దాడిలో భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే భరత్ మృతి చెందాడు.