సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కంగ్టి మండలం నాగూర్ (బీ) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బాలప్ప, నిర్మల కుమారుడు శివ (10) ఉదయం ఇంటి ముందర ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.