మునుగోడు, జూన్ 14 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చొల్లేడులో ఓ బాలుడు సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సతీశ్రెడ్డి వివరాలు ఇలా ఉన్నాయి. చొల్లేడుకు చెందిన కట్కూరి శివానంద్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
కొన్ని రోజులుగా సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను విసిగిస్తుండటంతో వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శివానంద్ సోమవారం సాయంత్రం గ్రామంలోని తమ కొత్తింటి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.
అనంతరం ఇంటి వద్దకు వచ్చి పురుగుల మందు తాగానని తాతకు చెప్పడంతో.. హుటాహుటిన చికిత్స నిమిత్తం 108లో నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుడి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సతీశ్రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.