తిమ్మాపూర్, జూన్ 28: తల్లి ప్రేమ దొరకడం లేదనే మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా అల్లునూర్లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బూసమల్ల మెర్సీ భర్త చనిపోవడంతో కరీంనగర్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది. ఆమె కొడుకు డానియల్(14) సొంతింట్లో మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఎల్ఎండీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆరు నెలల నుంచి తల్లికి దూరం గా ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన డానియల్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.