పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రిటైర్డ్ డీఈవో, ఆదర్శ లా కాలేజీ కరస్పాండెంట్ బూర విద్యాసాగర్ గౌడ్ రూ.5 లక్షల విరాళం అందించారు. అలాగే వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.3లక్షలు విరాళమిచ్చారు. దీనికి సంబంధించిన చెక్కులను బుధవారం ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి అందజేశారు.
ఈ రెండు ఆలయాల అభివృద్ధి కోసం మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న కృషికి తనవంతుగా చిన్న సహాయం చేస్తున్నట్లు బూర విద్యాసాగర్ గౌడ్ తెలిపారు. కాగా, తన నియోజకవర్గంలోని ఆలయాలకు విరాళం ఇచ్చిన బూర విద్యాసాగర్ గౌడ్ను ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వానికి తోడుగా మరికొందరు దాతలు ముందుకు రావాలని కోరారు.