బాల్కొండ/వేల్పూర్/భీమ్గల్, సెప్టెంబర్ 22: బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే ఓటు వేస్తామని కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. తాజాగా శుక్రవారం భీమ్గల్ మండలంలో పెద్ద ఎత్తున మైనార్టీలు బీఆర్ఎస్కు జైకొట్టారు. పట్టణంలో 800 మైనార్టీ కుటుంబాలు ప్రశాంత్రెడ్డికి మద్దతు తెలిపాయి. ఈ మేరకు వారంతా బాండ్ పేపర్పై రాసి సంతకాలు చేసి, స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. బడాభీమ్గల్లో 30, సికింద్రాపూర్లో 50, బాబాపూర్లో 500, గోన్గొప్పులలో 35 మైనారిటీ కుటుంబాలూ మంత్రికి మద్దతు తెలిపాయి. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆ ప్రతులను అందజేశారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ఎంబేరి చిన్న మున్నూరుకాపు సంఘ (32 కుటుంబాలు) సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. వేల్పూర్ మండలం అక్లూర్లోని మాదిగ సంఘ సభ్యులు (73 కుటుంబాలు) కూడా వేములకు మద్దతు ప్రకటించారు.