హైదరాబాద్ : చార్మినార్కు బాంబు బెదిరింపు వార్త నగరంలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు చార్మినార్ వద్ద బాంబులు పెట్టారని వార్త వైరల్గా మారింది. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాలతో పాటు పలు హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. సాధారణ తనిఖీలేనని పాతబస్తీ పోలీసులు తెలిపారు. ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.