ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11: లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు సహా తల్లిదండ్రులు దుర్మరణం చెందగా, కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. బొలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా గాయపడ్డారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మవరం వద్ద ఆదివారం చోటుచేసుకున్నది. ఏపీలోని కడప జిల్లా ఎర్రిపల్లికి చెందిన మోహన్రెడ్డి హైదరాబాలో ప్రింటింగ్ మిషన్ సామాన్ల దుకాణం నివసిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో స్వగ్రామం ఎర్రిపల్లికి బయలుదేరారు. ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో మోహన్రెడ్డి(45) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కర్నూల్ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మోహన్రెడ్డి భార్య సజాత (40), కూతురు స్నేహ(13) చనిపోయారు. కుమారుడు సాయి చికిత్స పొందుతున్నాడు. బొలెరో ప్రయాణిస్తున్న ముగ్గురికి వ్యక్తులకు గాయాలయ్యాయి.